ఆఘనత చంద్రబాబుదే..: తెనాలి శ్రావణ్ కుమార్

ABN , First Publish Date - 2021-07-06T23:47:29+05:30 IST

దళితులను పట్టాదారులుగా చేసిన ఘనత తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిదేనని ఆ పార్టీ గుంటూరు పార్లమెంట్ అధ్యక్షుడు తెనాలి శ్రావణ్ కుమార్ అన్నారు.

ఆఘనత చంద్రబాబుదే..: తెనాలి శ్రావణ్ కుమార్

అమరావతి:  దళితులను పట్టాదారులుగా చేసిన ఘనత తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిదేనని  ఆ పార్టీ గుంటూరు పార్లమెంట్ అధ్యక్షుడు తెనాలి శ్రావణ్ కుమార్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నాలుగు నెలల నుంచి వైసీపీ ప్రభుత్వం పేదలకు పెన్షన్ ఇవ్వడం లేదని మండిపడ్డారు. అమరావతిలో ఎలాంటి ఇన్ సైడర్ ట్రేడింగ్ జరగలేదని హైకోర్టు తీర్పునిచ్చిందన్నారు. దళిత భూములపై  వైసీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అవాస్తవాలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. జలవివాదాలు, ఆంధ్రా హక్కులను సోదరి షర్మిల కాలరాస్తున్నతరుణంలో ప్రజల దృష్టి మళ్లించేందుకు డ్రామాలాడుతున్నారని శ్రావణ్‌కుమార్ ధ్వజమెత్తారు. 

Updated Date - 2021-07-06T23:47:29+05:30 IST