వంటల వీడియోలు ఇక చాలు: సానియా మీర్జా

ABN , First Publish Date - 2020-04-05T00:25:10+05:30 IST

సోషల్ మీడియాలో వర్కౌట్ వీడియోల పోస్ట్ చేయడంపై ఇటీవల సెటబ్రిటీల మధ్య ఓ చిన్నపాటి మాటల యుద్ధమే....

వంటల వీడియోలు ఇక చాలు: సానియా మీర్జా


న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో వర్కౌట్ వీడియోల పోస్ట్ చేయడంపై ఇటీవల సెటబ్రిటీల మధ్య ఓ చిన్నపాటి మాటల యుద్ధమే సాగింది. కానీ ప్రస్తుతం అది కొంత సర్దుమణుగుతోందిలే అనుకుంటున్న ఈ సమయంలో టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఇంకో రకమైన వీడియోలపై అసహనం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో అదేపనిగా వంటల వీడియోలు పోస్ట్ చేసేవారిపై ఫైర్ అయ్యారు.


క్షణం తీరిక లేకుండా ఉండే సెలబ్రిటీలకు లాక్‌డౌన్ కారణంగా కావలసినంత తీరిక దొరికింది. అయితే తమ ఫ్యాన్స్‌కు దూరం కాకుండా ఉండేందుకు వారంతా వర్కౌట్ వీడయోలు, వంటల వీడియోలు, కామెడీ వీడియోలను సోషల్ మీడియాలో పెడుతూ క్వారంటైన్‌ను గడుపుడుతున్నారు. తమకు నచ్చిన సెలబ్రిటీలే ఇలా చేస్తుంటే ఇక వారి ఫ్యాన్స్ మాత్రం ఎందుకు ఆగుతారు. వారు ఇదే తీరును ఎంచుకున్నారు. అయితే ఈ వీడియోలపై కొందరు సెలబ్రిటీలు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


ప్రస్తుతం ఈ జాబితాలోకి సానియా మీర్జా కూడా చేశారు. ‘దేశంలో లక్షల మంది ఆకలి బాధతో అలమటిస్తున్నారు. ఒక్కపూట భోజనం దొరకడమే అదృష్టంగా బతుకుతున్నారు. ఇలాంటి సమయంలో ఈ వీడియోలేంటి. ఇప్పటికైనా ఇలాంటివి పోస్ట్ చేయడం ఆపండి’ అని తన ట్విటర్ ఖాతాలో ఓ సందేశం ఉంచారు. మరి చూడాలి సానియా మీర్జా అభిప్రాయానికి ఎంతమంది మద్దతు తెలుపుతారో.. ఏమో.

Updated Date - 2020-04-05T00:25:10+05:30 IST