హరేసముద్రంలో ఉద్రిక్తత
ABN , First Publish Date - 2021-04-09T05:48:12+05:30 IST
మండల పరిధిలోని హరేసముద్రం గ్రామంలో గురువారం సాయంత్రం 5 గంటల సమయంలో పోలింగ్ ముగియగానే గ్రామానికి ఎస్ఐ శేషగిరి,సిబ్బంది వెళ్లారు.
-ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని ధర్నా
మడకశిర రూరల్, ఏప్రిల్ 8: మండల పరిధిలోని హరేసముద్రం గ్రామంలో గురువారం సాయంత్రం 5 గంటల సమయంలో పోలింగ్ ముగియగానే గ్రామానికి ఎస్ఐ శేషగిరి,సిబ్బంది వెళ్లారు. ఎస్సీ కాలనీకి చెందిన సంజీవ్కుమార్, జాన్సనకుమార్ అనే ఇద్దరిపై చేయిచేసుకున్నారు. అంతేకాక వారిని తీసుకువెళ్లి చెరువుకట్టపై చితకబాధడంతో ఆగ్రహించిన ఎస్సీ కాలనీ వాసులు ధర్నాకు దిగారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ ఆంటోనప్ప, సీఐ రాజేంద్రప్రసాద్, సిబ్బందితో వచ్చి గ్రామంలో జరిగిన సంఘటనపై ఆరాతీశారు. ఎస్ఐ చేయిచేసుకున్న ఇద్దరు యువకులు కనిపించకపోవడంతో వారిని మాకు అప్పగించాలని డీఎస్పీ, సీఐలను చుట్టుముట్టారు. దీంతో కాలనీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. యువకులను అప్పగిస్తామని చెప్పడంతో కాలనీ వాసులు శాంతించారు. దురుసుగా ప్రవర్తిస్తున్న ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు.