బండి సంజయ్ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత

ABN , First Publish Date - 2022-01-03T00:40:44+05:30 IST

బీజేపీ నేత బండి సంజయ్ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. బండి సంజయ్ జాగరణ దీక్షకు అనుమతిలేదని పోలీసులు చెబుతున్నారు.

బండి సంజయ్ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత

కరీంనగర్: బీజేపీ నేత బండి సంజయ్ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. బండి సంజయ్ జాగరణ దీక్షకు అనుమతిలేదని పోలీసులు చెబుతున్నారు. దీంతో బీజేపీ కార్యకర్తలు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. బండి సంజయ్ కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అరెస్ట్ చేశారు. జీవో 317ను సవరించాలనే డిమాండ్‌తో సంజయ్ జాగరణ దీక్షకు పూనుకున్నారు. కాసేపట్లో బండి సంజయ్ జాగరణ దీక్షకు కూర్చోనున్నారు. దీక్షకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. అయితే దీక్ష చేసి తీరుతామని బీజేపీ నేతలు చెబుతున్నారు.

Updated Date - 2022-01-03T00:40:44+05:30 IST