లోకేష్ పర్యటనలో ఉద్రిక్తత
ABN , First Publish Date - 2021-03-07T00:46:54+05:30 IST
టీడీపీ నేత నారా లోకేష్ ఒంగోలు పర్యటన ఉద్రిక్తంగా
ప్రకాశం: టీడీపీ నేత నారా లోకేష్ ఒంగోలు పర్యటన ఉద్రిక్తంగా మారింది. పట్టణంలోని 47వ డివిజన్లో లోకేష్ రోడ్ షో నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో వైసీపీ కార్యకర్తలు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. దీంతో వారిని టీడీపీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఇరుపార్టీల కార్యకర్తలు నినాదాలు ఇవ్వడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. టీడీపీ కార్యకర్తలను లోకేష్ సముదాయించారు. ఇరువర్గాలకు సర్దిచెప్పి వారిని అక్కడి నుంచి పోలీసులు పంపివేశారు.