టెన్త్‌ పరీక్షల ఫీజు గడువు 20 వరకు

ABN , First Publish Date - 2021-04-16T10:02:19+05:30 IST

జూన్‌లో జరగనున్న పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు ఫీజు చెల్లింపు గడువును ప్రభుత్వం పొడిగించింది. ఎలాంటి ఆలస్య

టెన్త్‌ పరీక్షల ఫీజు గడువు 20 వరకు

అమరావతి, ఏప్రిల్‌ 15(ఆంధ్రజ్యోతి): జూన్‌లో జరగనున్న పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు ఫీజు చెల్లింపు గడువును ప్రభుత్వం పొడిగించింది. ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా ఈ నెల 20 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ ఎ.సుబ్బారెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.  రూ.50 ఆలస్య రుసుంతో ఈ నెల 25 వరకు, రూ.200 ఆలస్య రుసుంతో ఈ నెల 30 వరకు, రూ.500 ఆలస్య రుసుంతో మే 6 వరకు పరీక్ష ఫీజు చెల్లించే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. 

Updated Date - 2021-04-16T10:02:19+05:30 IST