స్కూలుకని చెప్పి బయటకు వెళ్లాడు.. వేరే పని ఉందంటూ ఫ్రెండ్‌కు బైబై చెప్పి... ఈ లోకానికే వీడ్కోలు పలికాడు... టెన్త్ కుర్రాడి డెత్ మిస్టరీ!

ABN , First Publish Date - 2021-10-07T17:54:42+05:30 IST

హరియాణాలోని కర్నాల్ జిల్లాలో అనుమానాస్పద

స్కూలుకని చెప్పి బయటకు వెళ్లాడు.. వేరే పని ఉందంటూ ఫ్రెండ్‌కు బైబై చెప్పి... ఈ లోకానికే వీడ్కోలు పలికాడు... టెన్త్ కుర్రాడి డెత్ మిస్టరీ!

హరియాణాలోని కర్నాల్ జిల్లాలో అనుమానాస్పద స్థితిలో టెన్త్ విద్యార్థి మృతి చెందాడు. రోజులు గడుస్తున్న కొద్దీ ఈ కేసు మరింత మిస్టరీగా మారుతుండటంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. కర్నాల్ జిల్లాకు చెందిన సౌరభ్ టెన్త్ చదువుతున్నాడు. ఊహించిన రీతిలో అతని మృతదేహం రైలు పట్టాలపై కనిపించడం స్థానికంగా సంచలనంగా మారింది. పోలీసులు సౌరభ్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. అయితే సౌరభ్ ఆత్మహత్య చేసుకున్నాడో, లేదా ఎవరైనా హత్య చేశారో ఇంకా స్పష్టం కాలేదు. మృతుని కుటుంబ సభ్యులు మాట్లాడుతూ రోజూ మాదిరిగానే సౌరభ్ తన స్నేహితుడు ప్రభాకర్‌తో పాటు ఆరోజు కూడా స్కూలుకు వెళ్లాడు.


అయితే ఆరోజు సౌరభ్ తనతో పాటు స్కూలుకు రాలేదని, ఎందుకు రావని అడిగితే కారణం చెప్పలేదని ప్రభాకర్ తెలిపాడు. తనకేదో ముఖ్యమైన పనిఉందని చెప్పి వెళ్లిపోయాడని ప్రభాకర్ పేర్కొన్నాడు.  దీంతో తాను ఒక్కడినే స్కూలుకు వెళ్లిపోయానని, సౌరభ్ ఎక్కడికి వెళ్లాడో తనకు తెలియలేదని అన్నాడు. అయితే కొద్దిసేపటి తరువాత సౌరభ్ మృతదేహం రైలు పట్టాలపై ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. అయితే ఇది ఆత్మహత్యో లేక ప్రమాదమో తెలియరాలేదు. ఈ రైల్వే ట్రాక్ స్కూలుకు దూరంగా ఉందని, అటువైపు వెళ్లాల్సిన అవసరం సౌరభ్‌కు లేదని కుటుంబ సభ్యులు అంటున్నారు. కుమారుని మృతితో సౌరభ్ తండ్రి తల్లడిల్లిపోతున్నారు. మరోవైపు అతని తండ్రి కుమారునికి ఫీజు కట్టలేని స్థితిలో ఉన్నారు. దీంతో ప్రతిరోజూ ఫీజు కట్టాలంటూ స్కూలు నుంచి ఫోను వచ్చేది. ఈ కారణంగానే కలతచెందిన సౌరభ్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-10-07T17:54:42+05:30 IST