ఖాకీల్లో కలవరం

ABN , First Publish Date - 2020-11-23T05:43:39+05:30 IST

ఏ చిన్న తప్పు చేసినా సహించం.. విధుల్లో నిక్కచ్చిగా వ్యవహరిస్తాం.. కిందిస్థాయి సిబ్బంది ముడుపులు తీసుకుం టున్నట్టు మా దృష్టికి వస్తే కఠినంగా వ్యవహరిస్తాం.. అం టూ ఊదరా గొట్టి.. ఇప్పుడు వారే ముడుపుల వ్యవహారంలో ఏసీబీకి పట్టుబడడంతో.. పోలీసు అధికారుల వ్యవహారశైలి ‘పైన పఠారం.. లోన లోటారం’ అన్న చందంగా ఉందని ఉ మ్మడి నిజామాబాద్‌ జిల్లాలోని అన్ని వర్గాల ప్రజల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.

ఖాకీల్లో కలవరం
కామారెడ్డి డీఎస్పీ కార్యాలయం

ఏసీబీ విచారణతో పోలీసులలో గుబులు
ఎప్పుడు ఎవరిని పిలుస్తారోనని ఆందోళన
కామారెడ్డిలో మూడో రోజూ కొనసాగిన  ఏసీబీ అధికారుల సోదాలు, విచారణ
ఆదివారం రాత్రి 8 గంటల వరకు డీఎస్పీ లక్ష్మీనారాయణను విచారించిన అధికారులు
భారీగా అక్రమ ఆస్తులు ఉన్నట్టు గుర్తింపు
కేసులో మరో ఇద్దరు ఎస్‌ఐలకు సైతం ప్రమేయం ఉన్నట్టు ఆరోపణలు
అజ్ఞాతంలోకి వెళ్లిన ఎస్‌ఐలు


కామారెడ్డి, నవంబరు 22:  ఏ చిన్న తప్పు చేసినా సహించం.. విధుల్లో నిక్కచ్చిగా వ్యవహరిస్తాం.. కిందిస్థాయి సిబ్బంది ముడుపులు తీసుకుం టున్నట్టు మా దృష్టికి వస్తే కఠినంగా వ్యవహరిస్తాం.. అం టూ ఊదరా గొట్టి.. ఇప్పుడు వారే ముడుపుల వ్యవహారంలో ఏసీబీకి పట్టుబడడంతో.. పోలీసు అధికారుల వ్యవహారశైలి ‘పైన పఠారం.. లోన లోటారం’ అన్న చందంగా ఉందని ఉ మ్మడి నిజామాబాద్‌ జిల్లాలోని అన్ని వర్గాల ప్రజల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. కామారెడ్డిలో ఇటీవల జరిగిన ఐపీఎల్‌ బెట్టింగ్‌లో పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేసేందుకు వెనకంజ వేస్తూ.. ముడుపులు తీసుకొని ఓ సీఐ, మరో డివిజన్‌ స్థాయి అధికారి అడ్డదారులు తొక్కడం, మధ్యవర్తి అ త్యుత్సాహం వల్ల బెట్టింగ్‌ కేసు విషయంలో సంబంధం ఉ న్న వారందరిపై ఏసీబీ దృష్టి పెట్టడంతో ఉమ్మడి జిల్లాలోని పోలీసుల గుండెల్లో గుబులు రేకెత్తుతోంది. ఇప్పటికే సీఐతో పాటు మధ్యవర్తిని అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు.. వారు ఇచ్చిన వాంగ్మూల్యంతో డీఎస్పీనిసైతం విచారించారు. ఈ కేసులో డీఎస్పీ రూ.3లక్షల వరకు తీసుకున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీఐ ఇచ్చిన వాంగ్మూలంలో ఈ కేసులో ఎక్కువ మొత్తం డబ్బులు డీఎస్పీకే వెళ్లాయని చెప్పడంతో ఏసీబీ అధికారులు డీఎస్పీని రెండు రోజులు లోతుగా విచా రణ చేశారు. డీఎస్పీ కార్యాలయంలో ఫైళ్లను కూడా పరిశీ లించారు. ఈ కేసుతో పాటు ఇతర కేసుల్లో కూడా డీఎస్పీ ఏమైనా వాటాలు తీసుకున్నారా అనే కోణంలో విచారించా రు. అంతేకాకుండా డీఎస్పీ పేరుమీద భారీగా అక్రమ ఆస్తు లు ఉన్నట్లు గుర్తించిన ఏసీబీ అధికారులు వాటి వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. ఐపీఎల్‌ వ్యవహారం డీఎస్పీ మెడకు చుట్టుకోవడంతో పాటు మరో ఇద్దరు ఎస్‌ఐలకు కూ డా ఇందులో పాత్ర ఉన్నట్లు ఏసీబీ అధికారులు అనుమానా లు వ్యక్తం చేస్తున్నారు. ఆ ఇద్దరు ఎస్‌ఐలను విచారించేందు కు ప్రయత్నిస్తున్నప్పటికీ వారి సెల్‌ ఫోన్‌లు స్విచ్చాఫ్‌ ఉ న్నాయి. దీంతో వారు అజ్ఞాతంలోకి వెళ్లినట్లుగా ఏసీబీ అధి కారులు భావిస్తున్నారు. అయితే, ఎస్‌ఐలు అందుబాటులో లేకుండాపోవడంతో ఐపీఎల్‌ కేసు వ్యవహారంలో వారికి కూ డా సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలకు బలం చేకూర్చిన ట్లవుతోంది.


మధ్యవర్తి అత్యుత్సాహంతోనే..
ఐపీఎల్‌ బెట్టింగ్‌ వ్యవహారంలో మధ్యవర్తిగా వ్యవహరిం చిన సెల్‌ఫోన్‌షాపు నిర్వాహకుడు సుజయ్‌తో సీఐ, డీఎస్పీకి ఎలాంటి సంబంధాలు ఉన్నాయనే కోణంలో ఏసీబీ అధికా రులు విచారణ చేపడుతుండగా.. సదరు మధ్యవర్తి తన వాంగ్మూల్యంలో అత్యుత్సాహం ప్రదర్శించినట్లు గుర్తించిన ఏసీబీ అధికారులు విచారణను మరింత లోతుగా చేపట్టినట్టు తెలిసింది. పలువురు నాయకులతో పరిచయాలు ఉ న్నాయంటూ ప్రచారం చేసుకునే ఓ వ్యక్తి.. పోలీసుల ముడు పుల వ్యవహారం చూసుకోవాలని సూచించడంతో సదరు మధ్యవర్తి అన్ని తానై చూసుకున్నట్టు సమాచారం. ఏదైనా కేసుకు సంబంధించి ముడుపులు వస్తే.. సదరు వ్యక్తికి పోలీ సులు వివరాలు అందించగానే ముడుపులు తీసుకుని తన కమీషన్‌ తాను తీసుకునే వాడని తెలిసింది. ఇదే క్రమంలో ఐపీఎల్‌ బెట్టింగ్‌ కేసులో సైతం పట్టుబడ్డ నిర్వాహకులతో మాట్లాడుతూ.. అధికంగా ఒత్తిడి చేయడం వల్లే సీఐ, డీ ఎస్పీల మెడకు ఈ కేసు చుట్టుకున్నట్లు విశ్వనీయవర్గాల స మాచారం. తనకు అధిక కమీషన్‌ వస్తుందని అత్యాశకు పో వడం డీఎస్పీ, సీఐల కంటే ఎక్కువగా నిర్వాహకులను ఒత్తి డికి గురిచేయడంతోనే ఏసీబీ అధికారులను ఆశ్రయించారని కామారెడ్డి పట్టణంలో తీవ్ర చర్చే జరుగుతోంది.


పట్టణ పోలీసు స్టేషన్‌ సిబ్బందిలో గుబులు
కామారెడ్డి పట్టణ సీఐ జగదీష్‌పై అవినీతి అక్రమాల ఫి ర్యాదు మేరకు ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. బెట్టింగ్‌ కేసులో అతను అక్రమాలకు పాల్పడట్లు ఏసీబీ అధికారుల విచారణలో వెల్లడైంది. దీంతో సీఐ జగదీ ష్‌ను అరెస్ట్‌ చేశారు. అలాగే, ఆయనతో పాటు ఐపీఎల్‌ బెట్టి ంగ్‌ నిర్వహణలో మధ్యవర్తిగా వ్యవహరించిన సుజయ్‌ను ప్రశ్నించిన ఏసీబీ అధికారులు అతనినీ అరెస్టు చేశారు. వీరి ద్దరి వాంగ్మూలాలను సేకరించిన ఏసీబీ అధికారులు డీఎస్పీ పాత్ర, పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో పనిచేస్తున్న ఇద్దరు ఎస్‌ఐల పాత్రపైనా లోతుగా విచారణ చేపట్టారు. వీరితో పాటు మ రి కొంతమంది సిబ్బంది పాత్ర కూడా ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది గుండెల్లో గుబులు రేకెత్తుతోంది. త ర్వాత ఏసీబీ అధికారుల నుంచి పిలుపు ఎవరికి వస్తుందోన ని ఉలిక్కిపడుతున్నారు. డీఎస్పీ కార్యాలయంలో రెండు రో జులు విచారణ కొనసాగించిన ఏసీబీ అధికారుల తీరుతో ఇ ద్దరు ఎస్‌ఐలు సెల్‌ఫోన్‌లు బంద్‌ పెట్టుకుని అజ్ఞాతంలోకి వెళ్లడంతో పట్టణ పోలీసు స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.


రాత్రి 8గంటల వరకు విచారణ
ఐపీఎల్‌ బెట్టింగ్‌ కేసు వ్యవహారంలో డీఎస్పీ పాత్రపై ఏసీబీ అధికారులు ఆదివారం రాత్రి 8 గంటల వరకు విచా రణ చేపట్టారు. రెండు రోజులు డీఎస్పీ కార్యాలయంలో సో దాలు కొనసాగించడంతో పాటు డీఎస్పీ లక్ష్మీనారాయణను సుమారు 12 గంటల పాటు విచారించారు. పలు అంశాల పై డీఎస్పీని విచారించారు. డీఎస్పీ కార్యాలయంలో పలు కీ లక డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకు న్నట్లు సమాచారం. డీఎస్పీ కార్యాలయంలో నిరంతరంగా ఏసీబీ సోదాలు కొనసాగుతుండడంతో పోలీసు అధికారులు ఆందోళనకు గురయ్యారు. డీఎస్పీ అక్రమ ఆస్తులపై పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు ఆ వివరాలను ఉన్నతాధికారులకు నివేదించి వారి సూచనల మేరకు విచారణను లోతుగా చేపట్టే అవకాశం ఉంది. విచారణ పూర్తయ్యే వరకు వివరాలు వెల్లడించలేమని ఏసీబీ అధికారులు తెలిపారు. మీడియాను కూడా గత మూడు రోజులుగా అనుమతించడం లేదు. ఏసీబీ ఇన్‌చార్జి ఏసీబీ ఆనంద్‌కుమార్‌ రోజుకు ఒకసారి మాత్రమే మీడియా వద్దకు వచ్చి విచారణ కొనసాగుతోందని, పూర్తి విచారణ అ నంతరమే వివరాలు వెల్లడిస్తామని, తమకు కీలకమైన స మాచారం లభించిందని చెప్పడం గమనార్హం. కాగా ఏసీబీకి భారీగా అక్రమ ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తిం చినట్లు సమాచారం. కాగా.. ఆదివారం రాత్రి 8 గంటల వర కు విచారణ కొనసాగించిన అధికారులు పలు కీలక డాక్యుమెంట్లు తీసుకొని వెళ్లిపోయారు. త్వరలోనే డీఎస్పీకి నోటీసులు అందజేసి, అరెస్ట్‌ చేస్తారని తెలుస్తోంది. విచారణ పూర్తయిన తర్వాతనే ఐపీఎల్‌ బెట్టింగ్‌ కేసు వ్యవహారంలో ఎవరెవరి పాత్ర ఉందనే అసలు నిజాలు వెలుగులోకి రానున్నాయి.

Updated Date - 2020-11-23T05:43:39+05:30 IST