నిబంధనలు తూచ్...!
ABN , First Publish Date - 2021-06-21T04:38:54+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ ఎత్తివేయడంతో మండలకేంద్రంలో ఆది వారం విపరీతంగా రద్దీ నెలకొంది.
- కొవిడ్ నిబంధనలు పాటించని వ్యాపారులు, ప్రజలు
- లాక్డౌన్ ఎత్తివేయడంతో ఇష్టారీతిన ఉల్లంఘనలు
ఖిల్లాఘణపురం, జూన్ 20: రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ ఎత్తివేయడంతో మండలకేంద్రంలో ఆది వారం విపరీతంగా రద్దీ నెలకొంది. ఆదివారం వారాంత సంత కావడంతో జనాల కిటకిట కనిపించింది. కొన్ని రోజులుగా వారాంత సంత బాగా జరగకపోవడంతో రద్దీ తక్కువగా ఉండేది. లాక్డౌన్ ఎత్తివేయడంతో రద్దీ పెరిగింది. అయితే లాక్డౌన్ ఎత్తివేసిన నిబంధ నలు పాటించాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించి నప్పటి కీ ఎక్కడా నిబంధనలు పాటించడం లేదు. భౌతిక దూరం ఎవరూ పట్టించుకోకపోగా.. చాలామంది మా స్కులు పెట్టుకోకుండానే తిరుగుతున్నారు. కొవిడ్ కేసు లు ప్రస్తుతానికి తగ్గుతున్నప్పటికి పాజిటీవ్ రోగులు సంతకు వస్తే వ్యాప్తి ఎక్కువగా జరిగే అవకాశం ఉం ది. నిబంధనలు పాటించడం కోసం పంచాయతీ ప్ర త్యేక అధికారిని నియమించి.. మైక్ల ద్వారా ప్రచారం చేస్తున్నప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదు. ప్రజలే కాదు.. సంతకు వచ్చే వ్యాపారులు కూడా మాస్కులు ధరించకుండానే దర్శనమిస్తున్నారు. కచ్చితంగా మా స్కులు ధరించి.. భౌతిక దూరం పాటించేలా చర్యలు తీ సుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే మాస్కులు ధరిం చని వారికి జరిమానాలు విధిస్తే మార్పు వచ్చే అవకా శం ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.