ఆ మద్యం సీసాల తనిఖీ

ABN , First Publish Date - 2021-01-17T05:53:43+05:30 IST

మద్యం సీసాలో చనిపోయిన పురుగులు ఉన్న ఘటనపై ఎక్సైజ్‌ శాఖ స్పందించింది.

ఆ మద్యం సీసాల తనిఖీ
మద్యం సీసాలను పరిశీలిస్తున్న ఎక్సైజ్‌ సిబ్బంది

  1. ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్‌


నంద్యాల(ఎడ్యుకేషన్‌), జనవరి 16: మద్యం సీసాలో చనిపోయిన పురుగులు ఉన్న ఘటనపై ఎక్సైజ్‌ శాఖ స్పందించింది. ‘మద్యం సీసాలో చచ్చిన పురుగులు’ అన్న శీర్షికన ఆంధ్రజ్యోతిలో కథనం ప్రచురితం కావడంతో యంత్రాంగం కదిలింది. చామకాల్వ సెంటర్‌ ప్రభుత్వ మద్యం దుకాణంలో ఏసీ బ్లాక్‌ విస్కీ సీసాలను శనివారం పరిశీలించారు. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వచ్చిన ఈ మద్యం సీసాలను నంద్యాలలోని గోడౌన్‌ నుంచి డివిజన్‌లోని వివిధ ప్రభుత్వ మద్యం దుకాణాలకు సరఫరా చేశారు. ఇందులో ఒక సీసాలో మృత పురుగులు రావడం కలకలం రేపింది. 



Updated Date - 2021-01-17T05:53:43+05:30 IST