వ్యాక్సినేషన్ తరువాతనే పరీక్షలు నిర్వహించాలి
ABN , First Publish Date - 2021-05-17T05:07:46+05:30 IST
పదో తరగతి, ఇంటర్ మీడియట్ విద్యార్థులందరికీ వ్యాక్సినేషన్ వేసిన తరువాతే పరీక్షలు నిర్వహించాలని టీఎన్ఎ్సఎ్ఫ రాజంపేట పార్లమెంటు అధ్యక్షుడు వేణుగోపాల్ అన్నారు.
నందలూరు, మే16 : పదో తరగతి, ఇంటర్ మీడియట్ విద్యార్థులందరికీ వ్యాక్సినేషన్ వేసిన తరువాతే పరీక్షలు నిర్వహించాలని టీఎన్ఎ్సఎ్ఫ రాజంపేట పార్లమెంటు అధ్యక్షుడు వేణుగోపాల్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నారా లోకేశ్ టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలని ముఖ్యమంత్రికి లేఖ రాస్తే పరీక్షలు నిర్వహిస్తామని చెప్పడం దారుణమన్నారు. ఆసుపత్రిలో బెడ్లు, ఆక్సిజన్, మందులు దొరకడం కాదు... కనీసం శ్మశానవాటికలో దహనసంస్కారాలకు ఖాళీ లేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉండటం సిగ్గు చేటన్నారు. మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేయడానికి భయపడే మీరూ నేడు విద్యార్థులకు పరీక్షలు నిర్వహించడానికి సన్నాహాలు చేయడం ఎంతవరకు సమంజసం అన్నారు. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పది, ఇంటర్ పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కొవిడ్ నిబంధనల పాటిస్తూ ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.