టీటీడీ భూముల వేలం ఆపాలి

ABN , First Publish Date - 2020-05-27T09:54:27+05:30 IST

టీటీడీ భూముల వేలం ఆపాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కందుల రాజమోహన్‌రెడ్డి ప్రభుత్వాన్ని

టీటీడీ భూముల వేలం ఆపాలి

కందుల రాజమోహన్‌రెడ్డి


కడప (మారుతీనగర్‌), మే 26: టీటీడీ భూముల వేలం ఆపాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కందుల రాజమోహన్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ పిలుపు మేరకు మంగళవారం స్థానిక కందుల ఎస్టేట్‌లో రాజమోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఉపవాస దీక్ష నిర్వహించి మాట్లాడారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కేవీ చలమారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పెసల సాంబశివారెడ్డి పాల్గొన్నారు.


స్థానిక బీజేపీ జిల్లా కార్యాలయంలో కందుల శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. ఆయన మాట్లాడుతూ టీటీడీకి సంబంధించిన భూములను విక్రయించే చర్యలకు పూనుకోవడంతో సీఎం జగన్‌ హిందువుల వ్యతిరేకిగా పాలన సాగిస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకుడు ఎరికలప్ప, వై.హరినారాయణ, మునగా సతీష్‌, రంగప్రసాద్‌ పాల్గొన్నారు. స్థానిక జీవీఆర్‌ టవర్స్‌లోని తన నివాసంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బండి ప్రభాకర్‌ నిరసన దీక్ష చేపట్టారు. వైసీపీ ప్రభుత్వం టీటీడీ భూములను వేలం వేయాలనుకునే ఆలోచన సరికాదన్నారు.

Updated Date - 2020-05-27T09:54:27+05:30 IST