తాడేపల్లి అత్యాచార ఘటన దురదృష్టకరం: మంత్రి వనిత

ABN , First Publish Date - 2021-06-21T23:11:53+05:30 IST

తాడేపల్లి అత్యాచార ఘటన దురదృష్టకరమని మహిళా, శిశుసంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు.

తాడేపల్లి అత్యాచార ఘటన దురదృష్టకరం: మంత్రి వనిత

అమరావతి: తాడేపల్లి అత్యాచార ఘటన దురదృష్టకరమని మహిళా, శిశుసంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. సోమవారం వనిత మీడియాతో మాట్లాడుతూ.. ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతోందన్నారు. ప్రభుత్వం తరపున రూ. 5 లక్షల పరిహారం అందిస్తామన్నారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ నుంచి మరో రూ. 50వేలు అందిస్తున్నట్లు తెలిపారు. ఇద్దరు దుండగులు ఈ  నేరానికి పాల్పడినట్లు ప్రాథమికంగా తెలిసిందన్నారు. బాధితులను కొట్టి బంగారు ఆభరణాలు లాక్కెళ్లారన్నారు. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా 50 శాతం ఆధారాలు సేకరించామని చెప్పారు. త్వరితగతిన పోలీసు దర్యాప్తు కొనసాగుతోందని మంత్రి వనిత తెలిపారు. 

Updated Date - 2021-06-21T23:11:53+05:30 IST