సైనా, శ్రీకాంత్‌ ముందంజ

ABN , First Publish Date - 2021-01-14T10:03:15+05:30 IST

థాయ్‌లాండ్‌ ఓపెన్‌లో పీవీ సింధు తొలిరౌండ్లోనే ఓడి నిరాశపరిచినా.. మరో ఏస్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్‌ శుభారంభం చేసి మహిళల సింగిల్స్‌లో భారత ఆశలను సజీవంగా ఉంచింది...

సైనా, శ్రీకాంత్‌ ముందంజ

  • థాయ్‌లాండ్‌ ఓపెన్‌
  • డబుల్స్‌లో సాత్విక్‌ జోడీ బోణీ

బ్యాంకాక్‌: థాయ్‌లాండ్‌ ఓపెన్‌లో పీవీ సింధు తొలిరౌండ్లోనే ఓడి నిరాశపరిచినా.. మరో ఏస్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్‌ శుభారంభం చేసి మహిళల సింగిల్స్‌లో భారత ఆశలను సజీవంగా ఉంచింది. ఇక.. పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్‌, డబుల్స్‌లో తెలుగు కుర్రాడు సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి జోడీ ముందంజ వేసింది. బుధవారం జరిగిన మొదటిరౌండ్లో సైనా 21-15,21-15తో మలేసియాకు చెందిన సెల్వాదూరె కిసోనాపై విజయం సాధించింది. పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్‌ 21-12, 21-11తో భారత్‌కే చెందిన సౌరభ్‌ వర్మను ఓడించి రెండోరౌండ్‌ చేరాడు. మరో మ్యాచ్‌లో ప్రత్యర్థి జాసన్‌ ఆంథోనీ హో షూ (కెనడా) 21-9, 13-21, 14-8తో ఆధిక్యంలో ఉన్నప్పుడు పారుపల్లి కశ్యప్‌ గాయంతో రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. సమీర్‌ వర్మ 15-21, 17-21తో షెసార్‌ (ఇండోనేసియా) చేతిలో ఓడాడు. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌-చిరాగ్‌ ద్వయం 19-21, 21-16, 21-14తో కొరియా జంట కిమ్‌ గి జంగ్‌-లీ యంగ్‌పై గెలిచి రెండోరౌండ్లో అడుగుపెట్టింది. 

Updated Date - 2021-01-14T10:03:15+05:30 IST