జై శ్రీరాం అంటూ బీజేపీ నేతల అకృత్యాలు : టీఎంసీ ఎంపీ

ABN , First Publish Date - 2021-01-17T15:17:42+05:30 IST

పశ్చిమబెంగాల్‌కు చెందిన తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎంపీ కల్యాణ్ బెనర్జీ మరోమారు వివాదాస్పద...

జై శ్రీరాం అంటూ బీజేపీ నేతల అకృత్యాలు : టీఎంసీ ఎంపీ

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌కు చెందిన తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎంపీ కల్యాణ్ బెనర్జీ మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతలు జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ, అకృత్యాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అత్యాచార ఆరోపణలు ఎందుర్కొటున్న పండితులకు వ్యతిరేకంగా బీజేపీ నేతలు నల్ల జండాలు పట్టుకుని, ఎందుకు ప్రదర్శనలు నిర్వహించడం లేదని ప్రశ్నించారు.


ఆ పండితులు బీజేపీకి చెందినవారు కావడం వల్లనే బీజేపీ నేతలు నిరసనలు వ్యక్తం చేయడం లేదన్నారు. ఇదేవిధంగా కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ గురించి కల్యాణ్ బెనర్జీ మాట్లాడుతూ బీజేపీకి ఆయన పెద్ద ఏజంట్ అని ఆరోపించారు. అధీర్ కాంగ్రెస్, వామపక్షాల కూటమిని కొనసాగనివ్వకపోవడం చూస్తూంటే ఆయన బీజేపీకి ఏజంట్ అని తెలుస్తున్నదన్నారు. కాగా ఎంపీ కల్యాణ్ బెనర్జీ ఇటీవలే సీతామాతపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.


Updated Date - 2021-01-17T15:17:42+05:30 IST