‘రవ్వంత సమయం’ కేటాయించారంటూ మోదీపై చిదంబరం సెటైర్
ABN , First Publish Date - 2021-04-18T22:10:29+05:30 IST
కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం ప్రధాని మోదీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘బెంగాల్ను జయించాలని
న్యూఢిల్లీ : కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం ప్రధాని మోదీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘బెంగాల్ను జయించాలని అత్యవసర యుద్ధమే ప్రకటించారు. అంతటి యుద్ధంలోనూ కరోనా మహమ్మారిపై సమీక్ష చేయడానికి రవ్వంత సమయం కేటాయించారు. అందుకు మీకు ధన్యవాదాలు’’ అంటూ చిదంబరం ఎద్దేవా చేశారు. బెంగాల్ ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీ సీఎం దీదీని ఉద్దేశిస్తూ దీదీ... ఓ దీదీ.. అంటూ సంబోధించారని, ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా సంబోధించడం సమంజసమేనా? అని చిదంబరం ప్రశ్నించారు. మాజీ ప్రధానులు నెహ్రూ, మొరార్జీ, వాజ్పాయ్ కూడా ఇలాంటి సంబోధన చేయలేదని చిదంబరం పేర్కొన్నారు. ‘వ్యాక్సిన్లు లేవు’ అని ఆస్పత్రుల్లో బోర్డులు వెలుస్తున్నాయని, అయినా సరే దేశంలో వ్యాక్సిన్ కొరత లేదని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ ప్రకటించడం విడ్డూరంగా ఉందని చిదంబరం మండిపడ్డారు.