భార్యను కాపురానికి పంపలేదని.. అత్తను హతమార్చిన అల్లుడు

ABN , First Publish Date - 2020-05-14T10:36:18+05:30 IST

భార్యను కాపురానికి పంపలేదనే కసితో అత్తను..

భార్యను కాపురానికి పంపలేదని.. అత్తను హతమార్చిన అల్లుడు

ఏఎస్‌పేట(నెల్లూరు): భార్యను కాపురానికి పంపలేదనే కసితో అత్తను కిరాతకంగా చంపాడో కిరాతకుడు. ఏఎస్‌పేట మండలం చౌటభీమవరంలో బుధవారం ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన మేకలబోయిన చిన్నయ్య, పోలమ్మ దంపతుల కుమార్తె దొరసానమ్మను దూబగుంట వాసి సూలా తిరిపాల్‌తో 25 ఏళ్ల క్రితం వివాహం చేశారు. తిరిపాల్‌ మద్యానికి బానిసై భార్యను వేధించడంతో ఏడేళ్ల క్రితం తన పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్లింది.


అప్పటినుంచి గొడవలు జరుగుతున్నాయి. బుధవారం ఉదయం అత్తింటికి వెళ్లి భార్యను పంపించాలని గొడవకు దిగాడు. ససేమిరా అనడంతో కత్తితో అత్త చేయిపై, మెడపై బలంగా నరకడంతో అక్కడికక్కడే మృతిచెందింది. నిందితుడు కత్తితో పరారయ్యాడు. నెత్తుటి మడుగులో ఉన్న తల్లిని చూసి కుమార్తె, కుటుంబసభ్యులు గుండెలు పగిలేలా రోదించడం చూపరులను కంటతడి పెట్టేలా చేసింది. ఆత్మకూరు సీఐ పాపారావు, ఏఎస్‌పేట ఎస్సై గోపాల్‌ ఘటనా స్థలిని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2020-05-14T10:36:18+05:30 IST