రూ. 3 వేల కోట్ల రీఫండ్‌కు... అదొక్కటే మార్గం

ABN , First Publish Date - 2020-08-04T21:52:09+05:30 IST

కరోనా, ఆ క్రమంలో లాక్‌డౌన్ నేపధ్యంలో... విమానాలు తిరగని విషయం తెలిసిందే. ఆ సమయంలో టిక్కెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు క్యాష్ రీఫండ్ చేయాల్సి ఉంది. అయితే... ప్రయాణికులకు జరగాల్సిన చెల్లింపుల విషయంలో... నగదు కొరత కారణంగా విమానయాన సంస్థలు... రూ. 3 వేల కోట్లను ఇప్పటికిప్పుడే రీఫండ్ అయ్యే అవకాశం లేదని తెలుస్తోంది.

రూ. 3 వేల కోట్ల రీఫండ్‌కు... అదొక్కటే మార్గం

న్యూఢిల్లీ : కరోనా, ఆ క్రమంలో లాక్‌డౌన్ నేపధ్యంలో... విమానాలు తిరగని విషయం తెలిసిందే. ఆ సమయంలో టిక్కెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు విమానయాన సంస్థలు నగదును రీఫండ్ చేయాల్సి ఉంది. అయితే... ప్రయాణికులకు జరగాల్సిన చెల్లింపుల విషయంలో... నగదు కొరత కారణంగా విమానయాన సంస్థలు... రూ. 3 వేల కోట్లను ఇప్పటికిప్పుడే రీఫండ్ చేసే అవకాశం లేదని తెలుస్తోంది.


దీంతో టిక్కెట్ క్యాన్సిలేషన్‌కు సంబంధించి క్రెడిట్ షెల్స్ ఉన్నవారు ఎక్కువకాలం వేచి ఉండాల్సిన పరిస్థితులున్నాయి. టిక్కెట్ క్యాన్సిలేషన్ చేసుకున్నపక్షంలో... ఆ మొత్తంతో భవిష్యత్తు తేదీలతో ప్రయాణికులు ప్రయాణించే అవకాశముంటుంది. 


ఆర్థిక పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, ఈ క్రమంలో... ప్రయాణీకులకు రీఫండ్ చేయడం సాధ్యం కాదని విమానయాన సంస్థలు చెబుతున్నాయి. ఈ డబ్బును క్రెడిట్ షేల్‌లో ఉంచుతున్నట్లు తెలిపాయి. ప్రభుత్వం కూడా ఫోర్స్ చేయలేని పరిస్థితి నెలకొని ఉన్న విషయం తెలిసిందే. 


Updated Date - 2020-08-04T21:52:09+05:30 IST