ఒప్పంద అధ్యాపకులకు 11వ పీఆర్సీని అమలు చేయాలి
ABN , First Publish Date - 2021-04-11T06:09:51+05:30 IST
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విధులు నిర్వహిస్తున్న ఒప్పంద అధ్యాపకులకు 11వ పీఆర్సీని వెంటనే అమలుపరచాలని ప్రభుత్వ జూనియర్ కళాశాలల ఒప్పంద అధ్యాపకుల సంఘం జిల్లా అధ్యక్షుడు కె. వినో ద్కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
భైంసా, ఏప్రిల్ 10 : ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విధులు నిర్వహిస్తున్న ఒప్పంద అధ్యాపకులకు 11వ పీఆర్సీని వెంటనే అమలుపరచాలని ప్రభుత్వ జూనియర్ కళాశాలల ఒప్పంద అధ్యాపకుల సంఘం జిల్లా అధ్యక్షుడు కె. వినో ద్కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన డివిజన్ స్థాయి ఒప్పంద అధ్యాపకుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. 11వ పీఆర్సీని అమలుపరచడంతో పాటు క్రమం తప్పకుండా నెలనెలా జాప్యం లేకుండా వేతనాలను చెల్లించాలన్నారు. ఇదే క్రమంలో ఒప్పంద అధ్యాపకుల బదిలీ ప్రక్రియను చేపట్టాలన్నారు. లాక్డౌన్ సమయం వేతనాలు సైతం అందించాలన్నారు. ఈ సందర్భంగా ఇటీవల భైంసా జూనియర్ కళాశాల ప్రిన్సిపల్గా బాధ్యతలు చేపట్టిన జూఫిషాన్ సుల్తానాను ఒప్పంద అధ్యాపక సంఘం ఘనంగా సన్మానించి జ్ఞాపికను బహూకరించారు.