మత్స్యకారులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త
ABN , First Publish Date - 2021-07-07T00:46:16+05:30 IST
రాష్ట్రంలోని మత్స్యకారులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. మెకనైజ్డ్,
అమరావతి: రాష్ట్రంలోని మత్స్యకారులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. మెకనైజ్డ్, మోటారు బోట్లలో వినియోగించే హైస్పీడ్ డీజిల్పై అమ్మకం పన్నును మినహాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హైస్పీడ్ డీజిల్ విక్రయించే 92 అవుట్ లెట్లలో పన్ను మినహాయింపు ఇచ్చారు. కేవలం చేపల వేటకు వినియోగించే బోట్లకే 6 నెలల పాటు మినహాయింపు వర్తిస్తుందని ప్రభుత్వం పేర్కొంది.