26న ఉపరాష్ట్రపతి రాక

ABN , First Publish Date - 2021-06-22T05:12:26+05:30 IST

ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఈ నెల 26న విశాఖపట్నం వస్తున్నారు.

26న ఉపరాష్ట్రపతి రాక

విశాఖపట్నం, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఈ నెల 26న విశాఖపట్నం వస్తున్నారు. ఆయన రెండు రోజులు ఇక్కడే ఉంటారు. 26వ తేదీ ఉదయం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో నగరానికి వచ్చి పోర్టు గెస్ట్‌హౌస్‌లో బస చేస్తారు. సాయంత్రం పోర్టు చైర్మన్‌, ఇతర అధికారులతో సమావేశం అవుతారు. 27న ఆదివారం ఉదయం 10 గంటలకు రాష్ట్రేతర తెలుగు సమాఖ్య ఆరవ వార్షికోత్సవాన్ని ముఖ్య అతిథిగా వర్చువల్‌గా ప్రారంభిస్తారు. 28న ఉదయం 11 గంటలకు ఢిల్లీ బయలుదేరి వెళతారు.

Updated Date - 2021-06-22T05:12:26+05:30 IST