మాటలు రాక.. మంటల్లో చిక్కి

ABN , First Publish Date - 2021-01-21T06:20:19+05:30 IST

పొందూరు మండలం వీఆర్‌ గూడేంలో మంగళవారం అర్ధ రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో అన్నెపు అమ్మోరు (55) సజీవ దహనమైంది. పోలీసులు, బం ధువుల కథనం మేరకు... పూరి ఇంట్లో ఉంటున్న అమ్మోరు మంగళవారం దీపం వెలిగించి నిద్రపోయింది.

మాటలు రాక.. మంటల్లో చిక్కి

వీఆర్‌గూడేంలో మహిళ సజీవదహనం

పొందూరు, జనవరి 20 : పొందూరు మండలం వీఆర్‌ గూడేంలో మంగళవారం అర్ధ రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో అన్నెపు అమ్మోరు (55) సజీవ దహనమైంది. పోలీసులు, బం ధువుల కథనం మేరకు... పూరి ఇంట్లో ఉంటున్న అమ్మోరు మంగళవారం దీపం వెలిగించి నిద్రపోయింది. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో అమ్మోరు ఇంటి నుంచి భారీగా మంటలు వ్యాపిం చాయి. దీంతో చుట్టు పక్కల వాళ్లంతా చేరుకు న్నారు. అప్పటికే మంటలు ఎగిసిపడుతుండడంతో ఎవరూ లోపలికి వెళ్లే సాహసం చేయలేకపోయారు. కొద్దిసేపటి తర్వాత గ్రామస్థులు మంటలను అదు పుచేసి ఇంట్లోకి వెళ్లిచూడగా, అమ్మోరు మంటల్లో కాలి విగతజీవిగా కనిపించింది. ఆమె అవివాహిత. ఒంటరి గానే జీవనం సాగిస్తోంది. ఆమెకు మాటలు కూడా సరిగ్గా రావు. దీంతో ఎవరినీ పిలవలేక మంటల్లో చిక్కు కొని మృతి చెందింది. అమ్మోరు  బంధువుల  ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ దేవానంద్‌ కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం తరలించారు.  

Updated Date - 2021-01-21T06:20:19+05:30 IST