‘తెలంగాణ ప్రజల ఆకాంక్షలు కాంగ్రెస్‌తోనే సాధ్యం’

ABN , First Publish Date - 2022-01-24T06:41:03+05:30 IST

తెలంగాణ ప్రజల ఆకాంక్షలు కాంగ్రెస్‌ తోనే సాధ్యమని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి పటేల్‌ రమేష్‌రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో మునిసిపల్‌ పరిధిలోని వస్త్రాంతండాకు చెందిన వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్‌ పార్టీలో చేరగా వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించి మాట్లాడారు.

‘తెలంగాణ ప్రజల ఆకాంక్షలు కాంగ్రెస్‌తోనే సాధ్యం’

సూర్యాపేటటౌన్‌, జనవరి 23: తెలంగాణ ప్రజల ఆకాంక్షలు కాంగ్రెస్‌ తోనే సాధ్యమని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి పటేల్‌ రమేష్‌రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో మునిసిపల్‌ పరిధిలోని వస్త్రాంతండాకు చెందిన వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్‌ పార్టీలో చేరగా వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించి మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ నాయకులు రాష్ట్రాన్ని రాబంధుల్లా దోచుకుంటున్నారని మండిపడ్డారు. కుటుంబ పాలనను సాగిస్తున్న సీఎం కేసీఆర్‌ లక్ష కోట్ల సంపాదనతో దేశంలోనే ధనవంతుడైన సీఎంగా మారాడన్నారు. అవినీతిని ప్రోత్సహిస్తున్న మంత్రి జగదీష్‌రెడ్డికి ప్రజలు త్వరలోనే బుద్ధి చెబుతార న్నారు. సూర్యాపేట నియోజకవర్గంలో 50 వేల కాంగ్రెస్‌ సభ్యత్వాల ను పూర్తి చేశామని, లక్ష సభ్యత్వాల నమోదే లక్ష్యమన్నారు. కార్యక్రమంలో షఫీవుల్లా, ప్రవీణ్‌, ఫరూఖ్‌, స్వామినాయుడు, పాల్గొన్నారు. 


Updated Date - 2022-01-24T06:41:03+05:30 IST