బీజేపీ కార్యకర్తలపై దాడి అమానుషం

ABN , First Publish Date - 2022-01-23T04:41:13+05:30 IST

కర్నూలు జిల్లాలోని ఆత్మకూరులో బీజేపీ కార్యకర్తలపై దాడి అమానుషమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు అట్టాడ రవిబాబ్జీ, పాల కొండ పట్టణాధ్యక్షుడు హనుమంతు తమ్మారావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బుద్దాల నిర్మలారెడ్డి ఖండించారు.

బీజేపీ కార్యకర్తలపై దాడి అమానుషం
పాలకొండలో నిరసన తెలుపుతున్న బీజేపీ నాయకులు


పాలకొండ/గుజరాతీపేట/ఇచ్ఛాపురం: కర్నూలు జిల్లాలోని ఆత్మకూరులో బీజేపీ కార్యకర్తలపై దాడి అమానుషమని ఆ పార్టీ  జిల్లా అధ్యక్షుడు అట్టాడ రవిబాబ్జీ, పాల కొండ పట్టణాధ్యక్షుడు హనుమంతు తమ్మారావు,  రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బుద్దాల నిర్మలారెడ్డి  ఖండించారు.  శనివారం శ్రీకాకుళం, పాలకొండ, ఇచ్ఛాపురంలలో  నిరసన సభను నిర్వహించారు. అన్యాయాలు, అక్రమాలపై ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నిస్తే కేసులు బనాయించడం వైసీపీ పాలనలో సర్వసాధారణమైపోయిందని.. ఇటువంటి చర్యలు ప్రజాస్వామ్య మనుగడకే ప్రశ్నార్థకంగా మారాయని రవిబాబ్జీ అన్నారు. పాతపట్నం, పలాస, టెక్కలి, నరసన్నపేట(పోలాకి), ఆమదాలవలస నియోజకవర్గ స్థాయిల్లో వర్చువల్‌గా ప్రజా నిరసన సభలు ఏర్పాటు చేసినట్లు  తెలిపారు. నాయకులు, కార్యకర్తలు, ప్రజలు 200 మంది వంతున ఈసభల్లో పాల్గొని వీక్షించి నిరసన తెలిపారన్నారు. 




Updated Date - 2022-01-23T04:41:13+05:30 IST