అధికారులు ప్రణాళిక రూపొందించుకోవాలి

ABN , First Publish Date - 2022-01-20T05:03:24+05:30 IST

జిల్లాలో హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించుకోవాలని కలెక్టర్‌ రవి అదేశించారు.

అధికారులు ప్రణాళిక రూపొందించుకోవాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ రవి

- కలెక్టర్‌ రవి
జగిత్యాల (ఆంద్రజ్యోతి), జనవరి 19: జిల్లాలో హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించుకోవాలని కలెక్టర్‌ రవి అదేశించారు. బుఽధవారం కలెక్టర్‌ రవి 2023 - 24 ప్లాంటింగ్‌  లక్ష్యంపై జిల్లా లెవన్‌ మానటరింగ్‌ కో- ఆర్డినేటర్ల కమిటీ సమావేశం నిర్వహించి అధికారులకు పలు సూచనలు చేశారు. 2022 సంవత్సరానికి 40,88,433 మొక్కలు నాటేందుకు ప్రణాళిక రూపొందించుకున్నామని చెప్పారు. వచ్చే రెండు సంవత్సరాల్లో యేటా కనీసం 10 శాతం లక్ష్యాన్ని పెంచే విధంగా ప్రణాళిక రూపొందించుకోవాలని అన్నారు. జిల్లాలో అధిక కాలం బతికే పూలు, పండ్ల, మేడికేషన్‌, బయో ఫెన్పింగ్‌ వంటి వివిధ రకాల మొక్కలు నాటేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.  కార్యక్రమంలో ఇన్‌చార్జి అదనపు కలెక్టర్‌, కోరుట్ల ఆర్‌డీవో వినోద్‌ కుమార్‌, డీఎఫ్‌వో వెంకటేశ్వర రావు, మున్సిపల్‌ కమిషనర్లులతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-20T05:03:24+05:30 IST