ఆటో‌డ్రైవరే హంతకుడు

ABN , First Publish Date - 2021-03-09T20:06:08+05:30 IST

ఖైత్లాపూర్‌లో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. పోలీసులు తెలిపిన

ఆటో‌డ్రైవరే హంతకుడు

కూకట్‌పల్లి: నగరంలో సంచలనం రేపిన ఖైత్లాపూర్‌లో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జనవరి 8న కూకట్‌పల్లి ఖైత్లాపూర్‌లో కాకర రామకృష్ణ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. రామకృష్ణను హత్య చేసిన సయ్యద్ షేర్ అలీ(38) అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు అలీ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో నిర్లక్ష్యంగా ఆటోను నడిపి మియాపూర్‌లో రోడ్డు మీద వెళతున్న రామకృష్ణను షేర్ అలీ ఢీకొట్టాడు. ఈ ఘటనలో రామకృష్ణ తీవ్రంగా గాయపడ్డాడు.


 తీవ్రంగా గాయపడిన రామకృష్ణను ఆసుపత్రికి తరలిస్తానంటూ మియాపూర్ నుంచి ఆటోలో నిందితుడు తీసుకుని వచ్చాడు. అక్కడి నుంచి ఆసుపత్రికి తీసుకు వెళ్లకుండా కూకట్‌పల్లి డంపింగ్ యార్డ్ వద్ద గాయాలతో బాధపడుతున్న రామకృష్ణను నిందితుడు పారవేసాడు. రామకృష్ణ దగ్గర ఉన్న సెల్‌ఫోన్, మూడు వేల రూపాయలను షేర్ అలీ అపహరించినట్లు పోలీసులు తెలిపారు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు రామకృష్ణ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని విచారణ ప్రారంభించారు. సీసీ కెమెరాలు, సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

Updated Date - 2021-03-09T20:06:08+05:30 IST