ప్రారంభం సరే... పూర్తయ్యేది ఎన్నడో...?

ABN , First Publish Date - 2021-08-03T06:41:26+05:30 IST

మండలంలోని అపిలేపల్లి - మందలపల్లి గ్రా మాల ప్రజల సౌకర్యార్థం ఏడు నెలల క్రితం రోడ్డు నిర్మాణానికి వైసీపీ ప్ర భుత్వం సంకల్పించింది.

ప్రారంభం సరే... పూర్తయ్యేది ఎన్నడో...?
అపిలేపల్లి-మందలపల్లి రోడ్డుపై కంకర వేసిన దృశ్యం

కుందుర్పి, ఆగస్టు 2: మండలంలోని అపిలేపల్లి - మందలపల్లి గ్రా మాల ప్రజల సౌకర్యార్థం ఏడు నెలల క్రితం రోడ్డు నిర్మాణానికి వైసీపీ ప్ర భుత్వం సంకల్పించింది. అనుకున్నదే తడవుగా జనవరి ఒకటో తేదీన ఎ మ్మెల్యే ఉషశ్రీచరణ్‌ పేరు మీద శిలాఫలకాన్ని ఆవిష్కరించి గ్రామీణ ప్రాం తాలకు తారురోడ్లు వేసేందుకు శ్రీకారం చుట్టారు. అంతే... కంకర తోలి రో డ్డు నిర్మాణ పనులు నిలిపేశారు. నెలలు గడిచిపోయినా తారురోడ్లు పూర్తికాలేదు. దీంతో ప్రయాణికులు  కంకర రోడ్డుపై నానా ఇబ్బందులు పడు తున్నారు. ఈరోడ్డుపై నడవాలంటే కాళ్లు బొబ్బలెక్కాల్సిందే. పొలాలకు పో యే రైతులు, కూలీలు అష్టకష్టాలు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకుని  రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయాలని కోరుతున్నారు. 

Updated Date - 2021-08-03T06:41:26+05:30 IST