శివదీక్షలు ప్రారంభం

ABN , First Publish Date - 2022-01-21T05:33:47+05:30 IST

శివదీక్షలు ప్రారంభం

శివదీక్షలు ప్రారంభం
మునీంద్ర శివాచార్యస్వామి చేతులమీదుగా శివమాలధారణ స్వీకరిస్తున్న భక్తులు

బషీరాబాద్‌/కొడంగల్‌ రూరల్‌, జనవరి 20 (ఆంధ్రజ్యోతి) : బషీరాబాద్‌ మండలంలోని నవాంద్గీ శ్రీ సంగమేశ్వరాలయంలో గురువారం భక్తులు శివదీక్షలు స్వీకరించారు. వీరతపస్వి మునీంద్ర శివాచార్యస్వామి హల్‌కట్టి చేతులమీదుగా శివభక్తులు దీక్షను తీసుకున్నారు. అనంతరం శివస్వాములు శివలింగానికి ప్రత్యేక పూజలతో పాటు అభిషేకాలు నిర్వహించారు. స్నేహబోర్‌ యజమాని శంభుస్వామి అన్నదానం చేశారు. శివమాలధారణ కార్యక్రమ ఏర్పాట్లను సర్పంచ్‌ వీరామణి మాధవరెడ్డి, ఉపసర్పంచ్‌ శశిరేఖ గోపాల్‌, గ్రామ పెద్దలు పర్యవేక్షించారు. అలాగే కొడంగల్‌లోని స్థానిక మహదేవుని ఆలయంలో గురుస్వాముల ఆధ్వర్యంలో మాలధారణ స్వీకరించారు. ఆలయంలో శివలింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలను స్వీకరించారు.

Updated Date - 2022-01-21T05:33:47+05:30 IST