సాయుధ పోరాటంలో భీంరెడ్డి సోదరులది ప్రముఖ పాత్ర
ABN , First Publish Date - 2022-01-24T06:39:21+05:30 IST
తెలంగాణ సాయుధ పోరాటంలో కొత్తగూడెం గ్రామానికి చెందిన భీంరెడ్డి సోదరులు ప్రముఖ పాత్ర పోషించారని గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ మందుల సామేల్ అన్నారు. తుంగతుర్తి మండలంలోని కొత్తగూడెం గ్రామంలో భీంరెడ్డి కుశలవరెడ్డి కాంస్య విగ్రహాన్ని కుటుంబసభ్యులతో కలిసి ఆయన ఆవిష్కరించి మాట్లాడారు.
తుంగతుర్తి, జనవరి 23: తెలంగాణ సాయుధ పోరాటంలో కొత్తగూడెం గ్రామానికి చెందిన భీంరెడ్డి సోదరులు ప్రముఖ పాత్ర పోషించారని గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ మందుల సామేల్ అన్నారు. తుంగతుర్తి మండలంలోని కొత్తగూడెం గ్రామంలో భీంరెడ్డి కుశలవరెడ్డి కాంస్య విగ్రహాన్ని కుటుంబసభ్యులతో కలిసి ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఆనాడు భీంరెడ్డి నర్సింహారెడ్డి, మల్లు స్వరాజ్యం అడుగుజాడల్లో కుశలవరెడ్డి నడి చారన్నారు. ఉద్యమాలకు కొత్తగూడెం అడ్డా అయినందునే మరో ఉద్య మకారుడు మారోజు వీరన్న పుట్టాడని అన్నారు. అనంతరం ఏపూరి సోమన్న ఆటపాటలతో అలరించారు. కార్యక్రమంలో మల్లు సుధీర్రెడ్డి, సీత, తీపిరెడ్డి సురేందర్రెడ్డి ప్రభావతి, సంకెపల్లి రవీందర్రెడ్డి, రమ, కపోతంరెడ్డి, వెంకట్రెడ్డి, సర్పంచ్ విజయ్, సంతోష్యాదవ్, లింగారెడ్డి, పూసపెల్లి బిక్షం, ప్రభాకర్ పాల్గొన్నారు.