బీజేపీ ఎస్సీ మోర్చాను పటిష్టం చేయాలి
ABN , First Publish Date - 2022-01-21T04:55:50+05:30 IST
భారతీయ జనతా పార్టీ అనుబంధ సంస్థ ఎస్సీ మోర్చా పటిష్టతకు నాయకులు కృషి చేయాలని ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ పిలుపునిచ్చారు.
ఎమ్మెల్సీ మాధవ్
భీమునిపట్నం, జనవరి 20: భారతీయ జనతా పార్టీ అనుబంధ సంస్థ ఎస్సీ మోర్చా పటిష్టతకు నాయకులు కృషి చేయాలని ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ పిలుపునిచ్చారు. గురువారం బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు కోడూరు సంజీవరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గ్రామస్థాయి నుంచి పార్టీని బలీయంగా తీర్చిదిద్దాలన్నారు. అనంతరం ఎస్సీ మోర్చా విశాఖ జిల్లా ప్రధానకార్యదర్శిగా కావూరి మధుసూదనరావు, జీవీఎంసీ 7,8 వార్డులతో కూడిన మధురవాడ ఎస్సీ మోర్చా మండలానికి అధ్యక్షుడిగా గండి ఆశారాజు, మరో 20 మందికి కార్యవర్గసభ్యులుగా నియమించారు. మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్రాజు, బీజేపీ నాయకుడు రవీంద్రరెడ్డి తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రాకేష్, ఎస్సీ మోర్చా జిల్లా ఇన్చార్జి కె.సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.