హైదరాబాద్‌లో వరదకు కొట్టుకుపోయిన బాలుడి మృతదేహం లభ్యం

ABN , First Publish Date - 2020-10-19T00:02:39+05:30 IST

హైదరాబాద్‌లో వరదకు కొట్టుకుపోయిన బాలుడి మృతదేహం లభ్యం

హైదరాబాద్‌లో వరదకు కొట్టుకుపోయిన బాలుడి మృతదేహం లభ్యం

హైదరాబాద్‌: గత నాలుగు రోజులుగా భాగ్యనగరంలో భారీగా కురుస్తున్న వర్షాలకు గగన్‌పహాడ్‌లో వరదకు కొట్టుకుపోయిన బాలుడి మృతదేహం లభ్యమైంది. 2 రోజుల క్రితం వరద నీటిలో అయాన్‌(7) కొట్టుకుపోయాడు. ఫంక్షన్‌హాల్‌ వద్ద చెట్ల పొదల్లో అయాన్‌ మృతదేహం లభ్యమైందని అధికారులు పేర్కొన్నారు.


రెండ్రోజుల క్రితం ఒకే కుటుంబానికి చెందిన నలుగురు కొట్టుకుపోయారు. ఇప్పటికే కరిమాబేగం, అమీర్‌ఖాన్‌, సాహిల్‌(4) మృతదేహాలు లభ్యమయ్యాయి. అయాన్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించించారు. ఈ సంఘటనతో ఇరు కుటుంబాల సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.

Updated Date - 2020-10-19T00:02:39+05:30 IST