విద్యుదాఘాతంతో బాలుడి మృతి
ABN , First Publish Date - 2020-03-24T12:47:36+05:30 IST
మండలంలోని కజ్జర్ల శివారు ప్రాంతంలో గల ఓ డైరీ ఫాంలో షేక్ ఆరీఫ్ (12) అనే బాలుడు విద్యుదాఘాతంతో సోమవారం
తలమడుగు, మార్చి23: మండలంలోని కజ్జర్ల శివారు ప్రాంతంలో గల ఓ డైరీ ఫాంలో షేక్ ఆరీఫ్ (12) అనే బాలుడు విద్యుదాఘాతంతో సోమవారం మృతిచెందినట్లు తలమడుగు ఎస్సై ది వ్యభారతి తెలిపారు. వివరాల ప్రకారం.. కజ్జర్ల గ్రామ సమీపంలోని డైరీ ఫాంలో పొట్టకూటి కోస ం వచ్చి జీవనాన్ని పోషించుకుంటున్నారు. సోమవారం డైరీ ఫాంలోని వాటర్ ట్యాంక్ వద్దకు వెళ ్లగా వాటర్ ట్యాంక్ వద్ద పాత మోటార్ ఉండడంతో మోటార్కు విద్యుత్షాక్ తగలడంతో ఆరీఫ్ షాక్కు గురవడంతో కుటుంబ సభ్యులు గమనించి చికిత్స నిమిత్తం ఆదిలాబాద్ రిమ్స్కు తరలిం చారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడని కుటుంబీకులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తలమడుగు పోలీసులు పేర్కొన్నారు.