ప్రేమించిన యువతిని నిర్బంధించిన ప్రియుడు
ABN , First Publish Date - 2021-07-07T03:39:28+05:30 IST
జిల్లాలోని వీరవాసరం మండలంలోని వుడూరు గ్రామంలో ప్రేమించిన యువతిని రమేష్
పశ్చిమ గోదావరి: జిల్లాలోని వీరవాసరం మండలంలోని వుడూరు గ్రామంలో ప్రేమించిన యువతిని రమేష్ అనే యువకుడు నిర్బంధించాడు. బెంగళూరుకు చెందిన యువతిని ప్రేమించి లాక్డౌన్లో రమేష్ వుడూరు వచ్చాడు. స్వగ్రామంలో వేరే అమ్మాయిని రమేష్ పెళ్లి చేసుకున్నాడు. విషయం తెలిసి బెంగళూరు నుంచి రమేష్ ఇంటికి యువతి వచ్చింది. ఆ యువతిన ఇంట్లోనే నిర్బంధించి రమేష్, అతని తల్లిదండ్రులు, బెదిరించారు. యువతి తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. రమేష్తో పాటు ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.