భర్త సెల్ నుంచి ఫ్రెండ్‌కు మెసేజ్‌.. బయటికి వెళ్లొస్తానని చెప్పిన నవ వధువు ఎంతకీ రాలేదు.. తీరా చూస్తే..

ABN , First Publish Date - 2021-11-04T00:11:55+05:30 IST

కేరళలోని త్రిస్సూర్ జిల్లా చెర్పు సమీపంలోని చవక్కాడ్‌కు చెందిన ఓ వ్యక్తి.. పజువిల్‌ అనే గ్రామానికి చెందిన 23 ఏళ్ల యువతిని అక్టోబర్ 25న వివాహం చేసుకున్నాడు. తర్వాతి రోజు బ్యాంకులో పని ఉంటే.. భార్యను కూడా తీసుకెళ్లాడు. లోపల పనిలో ఉండగా..

భర్త సెల్ నుంచి ఫ్రెండ్‌కు మెసేజ్‌.. బయటికి వెళ్లొస్తానని చెప్పిన నవ వధువు ఎంతకీ రాలేదు.. తీరా చూస్తే..

పెద్దలు కుదిర్చిన వివాహాల్లో ఒక్కోసారి సమస్యలు తలెత్తుతుంటాయి. ఇద్దరిలో ఒకరు అప్పటికే ప్రేమలో ఉండడం కొన్ని సార్లు చూస్తుంటాం. అలాంటి వారు పెద్దల బలవంతం మీద పెళ్లి చేసుకుని జీవితాన్ని భారంగా నెట్టుకురావడమో.. లేక ఇష్టపడిన వారితో పారిపోవడమో చేస్తుంటారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే యువతి మాత్రం చాలా విచిత్రంగా ఉన్నట్టుంది. పెళ్లైన తర్వాత రోజునే ఆమె చేసిన పని తెలిస్తే.. షాక్ అవుతారు. వివరాల్లోకి వెళితే.. 


కేరళలోని త్రిస్సూర్ జిల్లా చెర్పు సమీపంలోని చవక్కాడ్‌కు చెందిన ఓ వ్యక్తి.. పజువిల్‌ అనే గ్రామానికి చెందిన 23 ఏళ్ల యువతిని అక్టోబర్ 25న వివాహం చేసుకున్నాడు. తర్వాతి రోజు బ్యాంకులో పని ఉంటే.. భార్యను కూడా తీసుకెళ్లాడు. లోపల పనిలో ఉండగా.. భర్త ఫోన్ తీసుకున్న యువతి ఎవరికో ఫోన్ చేసింది. తర్వాత భర్తకు ఫోన్ ఇచ్చి.. బయటికెళ్లి వస్తా అని చెప్పి వెళ్లిపోయింది. అయితే సాయంత్రం 5దాటుతున్నా రాలేదు. రాత్రయినా రాకపోవడంతో అనుమానం వచ్చి.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ ప్రారంభించారు.


భర్త ఫోన్‌లోని నంబర్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించగా.. సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ నంబర్ అమ్మాయిదని తేలింది. కొన్ని రోజుల అనంతరం మధురైలో ఉన్న ఇద్దరు స్నేహితులను అదుపులోకి తీసుకున్నారు. పెళ్లి జరిగాక బంగారు ఆభరణాలతో పారిపోదామని ముందే ప్లాన్ చేసుకున్నట్లు వివరించారు. బంగారు నగలు తీసుకుని త్రిసూర్‌ నుంచి చెన్నైకి రైలు టికెట్‌ బుక్‌ చేసినట్లు విచారణలో తేలింది. అయితే రైలులో కాకుండా బస్సులో కొట్టాయంకు వెళ్లి.. మరుసటి రోజు చెన్నైకి రైలు ఎక్కారు. చెన్నై నుంచి మధురై వెళ్లి  అక్కడ ఓ హోటల్లో బస చేశారు.


ద్విచక్ర వాహనంపై ఎర్నాకులం వెళ్లి.. వారి వద్ద ఉన్న వస్తువులన్నింటినీ అక్కడే ఉంచి, మళ్లీ మధురైకి వచ్చినట్లు చెప్పారు. ఇద్దరూ కలిసి మదురై వస్త్ర దుకాణాల్లో ఉద్యోగాలు చేస్తూ జీవితం కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే.. ఇంకో యువతికి కూడా ఇటీవలే వివాహమైంది. ఆమె కూడా బంగారు నగలు తీసుకొచ్చింది. వీరి ప్రవర్తన గురించి తెలుసుకున్న వారంతా షాక్ అయ్యారు. విషయం తెలుసుకున్న భర్తకు గుండెపోటు వచ్చింది. వెంటనే ఆస్పత్రికి తరలించగా వైద్యులు చికిత్స చేయడంతో ప్రాణాపాయం తప్పింది.

Updated Date - 2021-11-04T00:11:55+05:30 IST