ఈ కారు రూ.2.22 కోట్లు
ABN , First Publish Date - 2021-01-19T05:47:51+05:30 IST
విలాసవంతమైన కార్ల తయారీ కంపెనీ లెక్సస్.. ఎల్ఎస్ 500హెచ్ నిషిజిన్ సెడాన్ కొత్త వేరియెంట్ను మార్కెట్లోకి తెచ్చింది.
న్యూఢిల్లీ: విలాసవంతమైన కార్ల తయారీ కంపెనీ లెక్సస్.. ఎల్ఎస్ 500హెచ్ నిషిజిన్ సెడాన్ కొత్త వేరియెంట్ను మార్కెట్లోకి తెచ్చింది. ఢిల్లీలో ఈ కారు ఎక్స్షోరూమ్ ధర రూ.2.22 కోట్లు. అలాగే ఎల్ఎస్ 500 హెచ్ కారును కూడా కొత్త ఫీచర్లతో విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ. 1.91 కోట్లు. మరింత ఆకర్షణీయమైన ఇంటీరియర్లు, స్మార్ట్ఫోన్ సహాయంతో పని చేసే ఆడియో, డిస్ప్లే స్ర్కీన్ కంట్రోల్ వంటి పలు అదనపు ఫీచర్లను జోడించడంతో కారు నడిపే సౌలభ్యం మరింతగా పెరుగుతుందని లెక్సస్ ఇండియా ప్రెసిడెంట్ పీబీ వేణుగోపాల్ చెప్పారు.