ఆటో బోల్తా పడి చిన్నారి మృతి
ABN , First Publish Date - 2021-06-15T06:20:45+05:30 IST
పట్టణంలోని సైదాపురం ఆంజనేయస్వామి ఆలయం వద్ద ఆటో అదుపు తప్పి బోల్తాపడి చిన్నారి అసీఫా (6) మృతి చెందిన
కదిరి , జూన 14 : పట్టణంలోని సైదాపురం ఆంజనేయస్వామి ఆలయం వద్ద ఆటో అదుపు తప్పి బోల్తాపడి చిన్నారి అసీఫా (6) మృతి చెందిన సంఘ టన ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. కాళసము ద్రంకు చెందిన షాకీర్ కుటుంబ సభ్యులతో కలిసి సొంత ఆటోలో కదిరి నుంచి కాళసముద్రంకు బయ లుదేరాడు. పట్టణంలోని ఆంజనేయస్వామి ఆలయం వద్ద స్పీడు బ్రేకర్లు గమనించక పోవడంతో ఒక్కసారిగా ఆటో అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో షాకీర్ కుమార్తె ఆసీఫా అక్కడికక్కడే మృతి చెందింది. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కదిరి ఆసుపత్రికి తరలించారు.