మోరీని ఽడీకొన్న కారు.. ఇద్దరు మృతి

ABN , First Publish Date - 2021-05-17T05:43:51+05:30 IST

మండలలోని రాళ్లఅనంతపురం సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

మోరీని ఽడీకొన్న కారు.. ఇద్దరు మృతి


ముగ్గురికి తీవ్ర గాయాలు


ముదిగుబ్బ, మే 16: మండలలోని రాళ్లఅనంతపురం సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీ సులు తెలిపిన మేరకు...కర్ణాటక రాష్ట్ర చిం తామణికి చెందిన రుక్మిణమ్మ(65) ఐదు రోజుల కిందట అనంతపురం లోని  బంధువుల ఇంటికి వచ్చింది. తిరిగి ఆదివారం మ రో నలుగురితో కలిసి రుక్మిణమ్మ అనంతపురం నుం చి చింతామణికి కారులో బయలుదేరింది. తెల్లవారుజామున మండలంలోని రాళ్లఅనంతపు రం సమీపానికి రాగానే డ్రైవర్‌ కారును అదుపు చేయలేక రోడ్డు పక్కన ఉన్న మోరీని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణి స్తున్న రుక్మిణమ్మ, డ్రైవర్‌ శివన్న(45) మృతిచెందగా మిగి లిన ముగ్గురు తీవ్రంగా పడ్డారు. వీరిని అనంతపురం ఆ స్పత్రికి తరలించారు. పోలీసులు సంఘనా స్థలాన్ని పరిశీ లించి కేసు నమోదు చేసుకుని మృతదేహాలను కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.


Updated Date - 2021-05-17T05:43:51+05:30 IST