సురేష్ బాబును మోసగించిన వ్యక్తిపై కేసు
ABN , First Publish Date - 2021-06-23T09:43:11+05:30 IST
వ్యాక్సిన్లు పంపిస్తామని నమ్మబలికి నిర్మాత సురే్షబాబు వద్ద రూ.లక్ష తీసుకొని మోసం చేసిన వ్యక్తిపై జూబ్లీహిల్స్ పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది.
వ్యాక్సిన్ల పేరిట నిర్మాత నుంచి రూ.లక్ష వసూలు
బంజారాహిల్స్/హైదరాబాద్, జూన్ 22(ఆంధ్రజ్యోతి): వ్యాక్సిన్లు పంపిస్తామని నమ్మబలికి నిర్మాత సురే్షబాబు వద్ద రూ.లక్ష తీసుకొని మోసం చేసిన వ్యక్తిపై జూబ్లీహిల్స్ పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. నిర్మాత సురే్షబాబుకు మే 31న గంగాధర్ అనే వ్యక్తి ఫోన్ చేశాడు. కొవిడ్ వ్యాక్సిన్లు సరఫరా చేస్తామని చెప్పాడు. తన వద్ద పనిచేసే సిబ్బందికి వ్యాక్సిన్లు వేయించవచ్చనే ఉద్దేశంతో సురే్షబాబు ఒప్పుకున్నారు. వెంటనే గంగాధర్ ఖాతాకు లక్ష రూపాయలు బదిలీ చేశారు. ఆ డబ్బును డ్రా చేసుకున్న గంగాధర్ అనంతరం ఫోన్ స్విచాఫ్ చేశాడు. మోసం జరిగినట్టు గ్రహించిన సురే్షబాబు మేనేజర్ ఐ.రాజేంద్రప్రసాద్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.