జనగణనలో బీసీలకు ప్రాధాన్యమివ్వండి
ABN , First Publish Date - 2020-02-23T07:40:31+05:30 IST
జనగణనలో బీసీ, ఓబీసీలను ప్రత్యేక వరుస క్రమంలో నమోదు చేయాలని బీసీ సంక్షేమ సంఘ నాయకులు కోరారు.
బలగ, ఫిబ్రవరి 22: జనగణనలో బీసీ, ఓబీసీలను ప్రత్యేక వరుస క్రమంలో నమోదు చేయాలని బీసీ సంక్షేమ సంఘ నాయకులు కోరారు. శనివారం సంఘ అధ్యక్షుడు పి.చంద్రపతిరావు ఆధ్వర్యంలో ప్రతినిధులు ఎంపీ రామ్మోహన్ నాయు డిని కలిసి వినతి పత్రం అందజేశారు. దీనిపై ఎంపీ సానుకూలంగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరిస్తామన్నారు. ఎంపీని కలసిన వారిలో ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సం ఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బాడాన దేవ భూషణరావు, అమీరుల్లాబేగ్, సిం హాద్రి ధనుంజయ, బసవా రాజేష్రెడ్డి, బొచ్చెన రాజేష్ ఉన్నారు.