ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం
ABN , First Publish Date - 2021-06-12T04:40:47+05:30 IST
ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం
- ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి
ఆమనగల్లు/తలకొండపల్లి: సీఎం సహాయ నిధి పేదలకు వరంగా నిలుస్తోందని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. ఆమనగల్లు, కల్వకుర్తి, కడ్తాల, వెల్దండ మండలాలకు చెందిన పలువురు బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రూ.2.12 లక్షలు మంజూరయ్యాయి. శుక్రవారం నగరంలోని తన నివాసంలో చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో నాయకులు సురేందర్రెడ్డి, చంద్రునాయక్, భాస్కర్రెడ్డి, యాదగిరిరెడ్డి, బాబా, నరేశ్నాయక్, రవీందర్ పాల్గొన్నారు. తలకొండపల్లి మండల పరిధిలోని రాంపూర్ గ్రామ పంచాయతీ సంగాయిపల్లికి చెందిన పి.నర్సింహ అనారోగ్యానికి గురై హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందాడు. ఎమ్మెల్యే జైపాల్యాదవ్ సహకారంతో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రూ.35,500 మంజూరయ్యాయి. శుక్రవారం వెల్జాల గ్రామంలో బాధిత కుటుంబానికి టీఆర్ఎ్స్ జిల్లా నాయకుడు సీఎల్ శ్రీనివాస్ యాదవ్ చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఉదయ్శర్మ, బాలకుమార్గౌడ్, తిరుపతయ్య పాల్గొన్నారు.