పాముల కలకలం
ABN , First Publish Date - 2021-10-24T04:33:23+05:30 IST
షిప్యార్డు కాలనీలో శనివారం నాలుగు చోట్ల పాములు కలకలం సృష్టించాయి.
మల్కాపురం, అక్టోబరు 23: షిప్యార్డు కాలనీలో శనివారం నాలుగు చోట్ల పాములు కలకలం సృష్టించాయి. స్థానికులు స్నేక్ క్యాచర్ ఆనంద్కు సమాచారం ఇవ్వడంతో ఆయన వచ్చి వాటిని చాకచక్యంగా పట్టుకుని నిర్మానుష్యంగా ఉన్న యారాడ కొండపై విడిచిపెట్టారు. అలాగే స్థానిక జైయాంధ్ర కాలనీలో శనివారం ఓ ఇంట్లోకి కొండచిలువ ప్రవేశించి కలకలం సృష్టించింది. పది అడుగుల పొడవు ఉన్న కొండచిలువ ఆ ఇంట్లో ఓ మూలన నక్కి ఉండడంతో దానిని గమనించి ఆ ఇంట్లో వాళ్లు భయంతో బయటకు పరుగులు తీశారు. స్థానికులు స్నేక్క్యాచర్ నాగరాజుకు సమాచారం ఇవ్వడంతో ఆయన వచ్చి దానిని పట్టుకుని ఓ గోనె సంచిలో బంధించి యారాడ కొండపై విడిచిపెట్టారు. దీంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.