నెలాఖరు నాటికి సమగ్ర భూ సర్వే పూర్తి
ABN , First Publish Date - 2022-01-23T05:00:04+05:30 IST
గ్రామాల్లో చేపడుతున్న సమగ్ర భూ సర్వే ఈ నెలాఖరు నాటికి పూర్తి చేసి నివేదిక అందించాలని పాలకొండ ఆర్డీవో టీవీఎస్జీ కుమార్ ఆదేశించారు. స్థానిక రెవె న్యూ కార్యాలయంలో శనివారం అధికారులతో సమీక్షించారు.
సారవకోట (జలుమూరు): గ్రామాల్లో చేపడుతున్న సమగ్ర భూ సర్వే ఈ నెలాఖరు నాటికి పూర్తి చేసి నివేదిక అందించాలని పాలకొండ ఆర్డీవో టీవీఎస్జీ కుమార్ ఆదేశించారు. స్థానిక రెవె న్యూ కార్యాలయంలో శనివారం అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అక్కివలస, వెంకటాబాగ్, బుడితిపేట, ఒప్పంగి, కొమ్ము సరియాపల్లి రెవెన్యూ గ్రామాల్లో సమగ్ర భూసర్వే జరుగుతుందన్నారు. భూసర్వేలో ఏమైనా సమస్యలు తలెత్తి ఫిర్యాదులు వస్తే నిబంధనల మేరకు పరిష్కరించాలన్నారు. సమావేశంలో తహసీల్దారు రాజమోహన్, డీఐవో సర్వేయర్ యజ్ఞేశ్వరరావు, వీఆర్వోలు పాల్గొన్నారు.