నెలాఖరు నాటికి సమగ్ర భూ సర్వే పూర్తి

ABN , First Publish Date - 2022-01-23T05:00:04+05:30 IST

గ్రామాల్లో చేపడుతున్న సమగ్ర భూ సర్వే ఈ నెలాఖరు నాటికి పూర్తి చేసి నివేదిక అందించాలని పాలకొండ ఆర్డీవో టీవీఎస్‌జీ కుమార్‌ ఆదేశించారు. స్థానిక రెవె న్యూ కార్యాలయంలో శనివారం అధికారులతో సమీక్షించారు.

నెలాఖరు నాటికి సమగ్ర భూ సర్వే పూర్తి
మాట్లాడుతున్న పాలకొండ ఆర్డీవో కుమార్‌

సారవకోట (జలుమూరు):  గ్రామాల్లో చేపడుతున్న సమగ్ర భూ సర్వే ఈ నెలాఖరు నాటికి పూర్తి చేసి నివేదిక అందించాలని పాలకొండ ఆర్డీవో టీవీఎస్‌జీ కుమార్‌ ఆదేశించారు. స్థానిక రెవె న్యూ కార్యాలయంలో శనివారం అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అక్కివలస, వెంకటాబాగ్‌, బుడితిపేట, ఒప్పంగి, కొమ్ము సరియాపల్లి రెవెన్యూ గ్రామాల్లో సమగ్ర భూసర్వే జరుగుతుందన్నారు. భూసర్వేలో ఏమైనా సమస్యలు తలెత్తి ఫిర్యాదులు వస్తే నిబంధనల మేరకు పరిష్కరించాలన్నారు. సమావేశంలో తహసీల్దారు రాజమోహన్‌, డీఐవో సర్వేయర్‌ యజ్ఞేశ్వరరావు, వీఆర్వోలు పాల్గొన్నారు.

 

Updated Date - 2022-01-23T05:00:04+05:30 IST