ముగిసిన జేష్ఠాభిషేకం
ABN , First Publish Date - 2021-06-24T05:43:52+05:30 IST
అహోబిలం లక్ష్మీనరసింహస్వామికి గత మూడు రోజుల నుంచి నిర్వహిస్తున్న జేష్ఠాభిషేక వేడుకలు బుధవారంతో ముగిశాయి.
ఆళ్లగడ్డ, జూన్ 23: అహోబిలం లక్ష్మీనరసింహస్వామికి గత మూడు రోజుల నుంచి నిర్వహిస్తున్న జేష్ఠాభిషేక వేడుకలు బుధవారంతో ముగిశాయి. ప్రహ్లాదవరదస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను పూలమాలలతో ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించినట్లు ప్రధాన అర్చకుడు వేణుగోపాలన్ తెలిపారు.