కాంగ్రెస్, బీజేపీలకు అధికారం పగటికలే
ABN , First Publish Date - 2022-01-18T06:25:49+05:30 IST
రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీలకు అ ధికారం పగటికలేనని ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు.
ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్రెడ్డి
గుర్రంపోడు, జనవరి 17: రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీలకు అ ధికారం పగటికలేనని ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. సోమవారం మండలకేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణలో కేసీఆర్ నా యకత్వంలోనే అభివృద్ధి జరుగుతుందని ప్రజలకు తెలుసని, 2023లో జరిగే ఎన్నికల్లో మెజారి టీ సీట్లు సాధించి అధికారం చే పడుతామన్నారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు కాంగ్రె్సలో కుమ్ములాటలు ఉన్నాయని, బీ జేపీ వాపును చూసి బలుపు అనుకుంటుందని ఎద్దేవా చేశారు. ఉత్తరాది 5 రాష్ర్టాల్లో జరగనున్న ఎన్నికల్లో బీజేపీ అధికారం కోల్పోతుందన్నా రు. ఏడున్నరేళ్ల కాలంలో వ్యవసాయం, సంక్షేమం, అభివృద్ధి, ఐటీ రంగాల్లో మొదటి మూడు స్థానాల్లో తెలంగాణ రాష్ట్రం ఉందన్నారు. 317 జీవోలో ఇబ్బందులను గుర్తిం చి తొలగేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. సమావేశంలో ఎంపీపీల ఫోరం జిల్లా అధ్యక్షుడు మంచికంటి వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీపీ సామల బొజ్జయ్య, నాయకులు వెలుగు రవి, కుప్ప పృధ్వీరాజ్, కుర్మారెడ్డి, బాల్రెడ్డి, చక్రవర్తి, నాగరాజు పాల్గొన్నారు.