రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేయాలి
ABN , First Publish Date - 2021-01-26T05:43:36+05:30 IST
అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని యథావిధిగా అమలు చేయాలని యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్.మురళీమోహన్రావు అన్నారు.
బెలగాం, జనవరి 25: అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని యథావిధిగా అమలు చేయాలని యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్.మురళీమోహన్రావు అన్నారు. 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నూతన జాతీయ విధానం 2020, మూడు వ్యవసాయ నల్ల చట్టాలు, ఎవరి ప్రయోజనాల కోసం అనే అంశం పై స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శివర్గ సభ్యు లు కె.రాజు అధ్యక్షతన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో మురళీ మోహన్రావు మాట్లాడుతూ భారత స్వాతంత్ర ఉద్యమ అనంతరం అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని నాటి స్వాతంత్య్ర ఉద్యమ నాయకులు ఆమోదిస్తే నేటి పాలకులు దానిని రాజకీయ, ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారన్నారు.