ఒకే రోజు కరోనాతో భార్యాభర్తల మృతి
ABN , First Publish Date - 2021-04-21T05:29:59+05:30 IST
కరోనాతో భర్త మృతి చెందిన కొన్ని గం టలకే భార్య మృతి చెందిన సంఘటన ఆర్మూర్లో జరిగింది.
ఆర్మూర్, ఏప్రిల్20: కరోనాతో భర్త మృతి చెందిన కొన్ని గం టలకే భార్య మృతి చెందిన సంఘటన ఆర్మూర్లో జరిగింది. ఆ ర్మూర్కు చెందిన ఎంఐఎం నాయకుడు, ఆయన భార్య ఇటీవల కరోనా బారిన పడ్డారు. హైదరాబాద్లోని ఒక ప్రైవేటు ఆసు పత్రిలో చికిత్స పొందుతూ భర్త మంగళవారం తెల్లవారు జా మున 4గంటల సమయంలో మరణించగా కొన్ని గంటలకే భా ర్య మృతి చెందింది. ఒకే రోజు భార్యాభర్తలు మృతి చెందడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కాగా పట్టణంలో కరో నాతో రాజారాంనగర్కు చెందిన ఒకరు మరణించారు. పట్టణం లో ప్రతీరోజు కరోనాతో మృతి చెందుతుండడంతో ప్రజలు ఆందో ళన చెందుతున్నారు.
నవీపేట మండలంలో ఇద్దరు..
నవీపేట: మండలంలోని నాగేపూర్కు చెందిన 55 ఏళ్ల మహిళ సోమవారం రాత్రి కరోనాతో మృతిచెందిందని గ్రామస్థు లు తెలిపారు. రెండు రోజుల క్రితం ఆమె అనారోగ్యానికి గురికా గా చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతిచెందిం దని గ్రామస్థులు తెలిపారు. మండలంలోని నాడాపూర్కు చెం దిన 56 ఏళ్ల వ్యక్తి కరోనాతో సోమవారం రాత్రి మృతిచెందాడని గ్రామస్థులు తెలిపారు. నాలుగు రోజుల క్రితం జిల్లాకేంద్రంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేరగా సో మ వారం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడని గ్రామస్థులు తెలిపారు. మృతదేహాలకు మంగళవారం కొవి డ్ నిబంధనల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించినట్లు తెలిపారు.
మైలారంలో ఒకరు...
సిరికొండ: మండలంలోని మైలారం గ్రామానికి చెందిన ఒక రు కరోనా మృతి చెందారు. మైలారం గ్రామానికి చెందిన సదరు వ్యక్తి దమ్ము వస్తుందని సిరిసిల్ల ఆసుపత్రికి వెళ్లగా మంగళ వారం చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
రెంజల్లో ఒకరు...
రెంజల్: మండల కేంద్రంలో కోటగిరి శంకర్ (62) గత పది రోజుల క్రితం కరోనా పాజిటివ్ రావడంతో నిజామాబాద్ కేంద్రం లో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు డాక్టర్ క్రిస్టీనా తెలిపారు.