ప్రాదేశిక ఫలితాలపై కోర్టు తీర్పు హర్షణీయం

ABN , First Publish Date - 2021-09-17T05:00:20+05:30 IST

ప్రాదేశిక ఎన్నికల ఫలితాల విషయంలో హైకోర్టు తీర్పు హర్షణీయమని కేంద్ర మాజీ మంత్రి డాక్టర్‌ కిల్లి కృపారాణి అన్నారు.గురువారం టెక్కలిలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ తీర్పును స్వాగతిస్తున్నట్లు తెలిపారు.

ప్రాదేశిక ఫలితాలపై కోర్టు తీర్పు హర్షణీయం
మాట్లాడుతున్న కిల్లి కృపారాణి




 కేంద్ర మాజీ మంత్రి కృపారాణి

 టెక్కలి: ప్రాదేశిక ఎన్నికల ఫలితాల విషయంలో హైకోర్టు తీర్పు హర్షణీయమని కేంద్ర మాజీ మంత్రి డాక్టర్‌ కిల్లి కృపారాణి అన్నారు.గురువారం టెక్కలిలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ తీర్పును స్వాగతిస్తున్నట్లు తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే స్థానిక ఎన్నికలు జరగాల్సి ఉన్నప్పటికీ చంద్రబాబు వాయిదా వేసుకుంటూ వచ్చారని గుర్తుచేశారు. ప్రజాస్వామ్య ప్రక్రియను అడ్డుకునే ప్రయత్నం చేశారని ఆమె ఆరోపించారు. కరోనా సాకుతో అప్పటి ఎన్నికల కమిషనర్‌ ప్రభుత్వంతో సంప్రదించకుండా ఎన్నికలను వాయిదా వేశారన్నారు. ఎన్నికల ప్రక్రియకు, కౌంటింగ్‌కు అడ్డుపడ్డ ప్రతిపక్షం ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు.  ఇకనైనా అటువంటి విధానాలను విడనాడాలన్నారు. సమావేశంలో డాక్టర్‌ కిల్లి రామ్మోహనరావు, వి.శ్రీధర్‌రెడ్డి, లక్ష్మీపతి, బి.కార్తీక్‌లు ఉన్నారు.




Updated Date - 2021-09-17T05:00:20+05:30 IST