ప్రభుత్వ సూచనల మేరకు పంటలు సాగు చేయాలి..
ABN , First Publish Date - 2020-06-04T09:52:59+05:30 IST
రైతులు ప్రభుత్వ సూచనల మేరకు రైతులు పంటలు సాగు చేయాలని కలెక్టర్ శశాంక, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
కలెక్టర్ శశాంక, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
రామడుగు, జూన్ 3: రైతులు ప్రభుత్వ సూచనల మేరకు రైతులు పంటలు సాగు చేయాలని కలెక్టర్ శశాంక, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. బుధవారం వారు రామడుగు మండలంలో సాగు చేస్తున్న అంజీరా, డ్రాగన్ ఫ్రూట్ తోటలలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేయాలని రైతులకు పిలుపునిచ్చారు. మండలంలోని వెంకట్రావుపల్లిలో చేపడుతున్న ఉపాధిహామి పనులను ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, కలెక్టర్ శశాంక పరిశీలించారు.
ధాన్యం, మక్కల కొనుగోళ్లను పూర్తిచేయండి
చొప్పదండి: రెండు మూడు రోజుల్లో ధాన్యం, మక్కల కొనుగోలును పూర్తి చేయాలని కలెక్టర్ శశాంక అన్నారు. బుధవారం ఆయన ఎమ్మెల్యే సుంకె రవిశంకర్తో కలిసి మంగళపల్లి గ్రామాన్ని సందర్శించారు. కేంద్రాల్లోని ధాన్యం మక్కలను పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్రెడ్డి, ఎంపీపీ చిలుక రవీందర్, సర్పంచ్ నాగిరెడ్డి, ఎంపీటీసీ విజయలక్ష్మి, సింగిల్ విండో చైర్మన్లు మల్లారెడ్డి, తిరుపతిరావు పాల్గొన్నారు.