వడదెబ్బతో ఒకరి మృతి
ABN , First Publish Date - 2020-05-29T11:19:15+05:30 IST
వడదెబ్బతో ఒకరు మృతి చెందిన సంఘటన చింతకానిలో గురువారం చోటుచేసుకుంది
కాటారం, మే 28 : వడదెబ్బతో ఒకరు మృతి చెందిన సంఘటన చింతకానిలో గురువారం చోటుచేసుకుంది. చేరాల రవి(42) వ్యవసాయ పనులతో పాటు ఇంటి అవసరాల కోసం బయటకు వెళ్లి వడదెబ్బకు గురయ్యాడు. ఇంటికి వచ్చి వాంతులు చేసుకుని అస్వస్థత పాలయ్యాడు. ఆర్ఎంపీ వద్ద ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం మహాదేవపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నిస్తుండగానే రవి మృతి చెందాడు.