కేంద్ర కేబినెట్‌ నిర్ణయాలు అమోఘం.. అద్భుతం

ABN , First Publish Date - 2020-07-10T08:31:35+05:30 IST

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాలు అమోఘం.

కేంద్ర కేబినెట్‌ నిర్ణయాలు అమోఘం.. అద్భుతం

  • ప్రధాన మంత్రి మోదీకి వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు లేఖ

అమరావతి, జూలై 9(ఆంధ్రజ్యోతి): ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాలు అమోఘం.. అద్భుతమని నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ప్రశంసించారు. రైతులు, పేదలు, మధ్యతరగతి వర్గాలకు ఊరటనిచ్చే ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నందుకు ప్రధాని మోదీని అభినందిస్తూ గురువారం ఆయన లేఖ రాశారు.


లక్ష కోట్ల రూపాయల మౌలిక సదుపాయాల నిధిని ఏర్పాటు చేయడం ద్వారా రైతులకు అద్భుతమైన చేయూతను అందించారని ప్రధాని మోదీని ప్రశంసించారు. పట్టణాలు, నగరాల్లో పేద మధ్యతరగతి వర్గాలు ఉపాధికోసం వలసబాట పట్టినప్పుడు అతితక్కువ అద్దెకు.. ప్రధాని ఆవాస యోజన కాంప్లెక్స్‌లను నిర్మించాలన్న నిర్ణయాన్ని స్వాగతించారు. నవంబరు వరకూ పీఎం గరీబ్‌కల్యాణ్‌ యోజనను పొడిగించినందుకు కూడా కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - 2020-07-10T08:31:35+05:30 IST